16 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
ABN , First Publish Date - 2020-06-07T19:09:54+05:30 IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నట్లు విశ్వాసనీయ సమాచారం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నట్లు విశ్వాసనీయ సమాచారం. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ హరిచందన్ ప్రసంగించనున్నారు. 18వ తేదీన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఇంతకుముందే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో సమావేశాలను ప్రభుత్వం వాయిదా వేసింది. నాలుగు నెలల పాటు ఆర్డినెన్స్ ద్వారా బడ్డెట్ను ఆమోదింపజేసుకున్నారు.
ఈనెల 30తో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్కు కాలం చెల్లుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. 19న రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 నుంచి నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.