ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలి: కొండా సురేఖ

ABN , First Publish Date - 2021-11-23T00:38:27+05:30 IST

ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలని కాంగ్రెస్ నేత కొండా సురేఖ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలి: కొండా సురేఖ

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలని కాంగ్రెస్ నేత కొండా సురేఖ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదన్నారు. దీనిపై పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు స్పందించాలని కోరారు. ఈ ఘటనపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించకపోవడం విచారకరమన్నారు. తల్లిలాంటి మహిళకు అవమానం జరిగినా.. మంత్రి కేటీఆర్ కనీసం స్పందించకపోవడం బాధాకరమని కొండా సురేఖ విమర్శించారు.

Updated Date - 2021-11-23T00:38:27+05:30 IST