TAMMINENI SEETHARAM: హత్యాచారాలు చేసేవారు భూమ్మీద ఉండటానికి వీల్లేదు

ABN , First Publish Date - 2021-07-24T00:46:26+05:30 IST

మరోసారి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు

TAMMINENI SEETHARAM: హత్యాచారాలు చేసేవారు భూమ్మీద ఉండటానికి వీల్లేదు

అమరావతి: మరోసారి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై హత్యాచారాలు చేసేవారు భూమ్మీద ఉండటానికి వీల్లేదని స్పీకర్‌ తమ్మినేని అన్నారు. అవుట్ ఆఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో న్యాయం జరుగుతుందని స్పీకర్‌ అభిప్రాయపడ్డారు. మీ 'లా' లు ఏమిచేస్తాయో తనకు తెలియదని సీతారాం పేర్కొన్నారు. సమాజానికి రక్షణగా ఉండాల్సిన మగాడు మృగంగా మారితే క్షమించకూడదన్నారు. ఎక్కడో ఒక దగ్గర మహిళలపై దాడులకు ఫుల్ స్టాప్ పడాలని తమ్మినేని సీతారాం అన్నారు. 

Updated Date - 2021-07-24T00:46:26+05:30 IST