తూ.గో. జిల్లాలో కొనసాగుతున్న బంద్

ABN , First Publish Date - 2021-03-05T16:47:11+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతోంది.

తూ.గో. జిల్లాలో కొనసాగుతున్న బంద్

తూ.గో. జిల్లాలో కొనసాగుతున్న బంద్

రాజమండ్రి: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. టీడీపీతోపాటు వామపక్ష పార్టీలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. రాజమండ్రితోపాటు తూ.గో. జిల్లాలోని తొమ్మిది డిపోల్లో పూర్తిగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం టీడీపీతోపాటు వామపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయి. విద్యార్థి, కార్మిక సంఘాల నేతలు కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రుల హక్కుగా ఉన్న స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-03-05T16:47:11+05:30 IST