నేడు ఏపీలోని కలెక్టరేట్ల ముందు బీజేపీ ఆందోళన

ABN , First Publish Date - 2020-09-24T14:54:29+05:30 IST

ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ముందు ఆందోళన చేపట్టనున్నారు.

నేడు ఏపీలోని కలెక్టరేట్ల ముందు బీజేపీ ఆందోళన

అమరావతి: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ముందు ఆందోళనకు దిగనున్నారు. ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై వైసీపీ మంత్రి కొడాలి నాని  చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు జరుగుతున్న కుట్రపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ఆందోళన చేయనున్నారు. మంత్రి కొడాలి నానిని ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఆందోళనలో పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు. 

Updated Date - 2020-09-24T14:54:29+05:30 IST