తెలంగాణ భూభాగంలో ఏపీ సరిహద్దు రాళ్లు
ABN , First Publish Date - 2021-01-26T08:59:19+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో తెలంగాణ భూభాగంలోకి సోమవారం ఉదయం ఏపీ అధికారులు వచ్చి సరిహద్దు రాళ్లను పాతేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు ఆ
భద్రాద్రిజిల్లాలో ఏపీ అధికారుల చర్య.. అడ్డుకున్న స్థానికులు
అశ్వారావుపేట, జనవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో తెలంగాణ భూభాగంలోకి సోమవారం ఉదయం ఏపీ అధికారులు వచ్చి సరిహద్దు రాళ్లను పాతేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు ఆ పనులను అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ అధికారులు పనులను నిలిపేసి వెనుతిరిగారు. జాయింట్ సర్వే చేయకుండా ఏక పక్షంగా ఏపీ అధికారులు సరిహద్దు రాళ్లను పాతితే క్రిమినల్ చర్యలకు వెనకాడబోమని అశ్వారావుపేట తహసీల్దార్ హెచ్చరించారు.