శుక్రవారం ఏపీ కేబినెట్ భేటీ.. ఉద్యోగుల ఆందోళనపై చర్చ!

ABN , First Publish Date - 2022-01-21T03:52:15+05:30 IST

రాష్ట్ర మంత్రి మండలి శుక్రవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు..

శుక్రవారం ఏపీ కేబినెట్ భేటీ.. ఉద్యోగుల ఆందోళనపై చర్చ!

అమరావతి: రాష్ట్ర మంత్రి మండలి శుక్రవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణాలపై చర్చించనున్నారు. ఉద్యోగుల పీఆర్సీ జీవోపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 


మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం మరోసారి చర్చించుకొని ఉమ్మడి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుండటంపై ఉద్యోగుల్లో ఆతృత నెలకొంది. పీఎర్సీ అంశంపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2022-01-21T03:52:15+05:30 IST