28న ఏపీ కేబినెట్ సమావేశం
ABN , First Publish Date - 2021-10-28T01:57:47+05:30 IST
రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించడానికి 28న ఉ. 11 గంటలకు ఏపీ
అమరావతి: రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించడానికి 28న ఉ.11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక ఎజెండాలపై చర్చ జరుపనున్నారు. అన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకాల ఆర్డినెన్స్కు ఆమోదం తెలుపనుంది. సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు కేబినెట్ అమోదం తెలపనుంది. అలాగే వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరుగనుంది. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై చర్చ, చట్ట సవరణపై చర్చించనున్నారు. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై ఏపీ కేబినెట్ సమావేశం చర్చంచే అవకాశం ఉంది.