AP: మహాపాదయాత్రలో పాల్గొన్న నేతలపై కేసులు
ABN , First Publish Date - 2021-11-24T13:49:24+05:30 IST
రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొన్న నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
నెల్లూరు: రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొన్న నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ, బీజేపీ నేతలపై కావలి పోలీసులు కేసులు పెట్టి హైకోర్టుకు పంపారు. కావలి రూరల్ పోలీస్స్టేన్లో రెండు, టూటౌన్ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదు అయ్యాయి. టీడీపీ నేత బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరామారావు, రామకృష్ణ, బీజేపీ నేతలు సుజనా చౌదరి, పురంధేశ్వరి, సీఎం రమేష్, కామినేనిలపై కేసులు నమోదు అయ్యాయి. కాగా...అటు పాదయాత్రలో పాల్గొనని వారిపైనా పోలీసులు కేసులు పెట్టారు.