Nellore: మహాపాదయాత్రకు పోలీసుల అడ్డంకులు
ABN , First Publish Date - 2021-11-30T15:23:08+05:30 IST
రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు.
నెల్లూరు: రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. అల్లా, ఏసుక్రీస్తు వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు పోలీసుల కాళ్లుపట్టుకుని బ్రతిమిలాడే పరిస్థితి కలిగింది. మరికొందరు రైతులు, నేతలు మాత్రం ఈ వ్యవహారంపై పోలీసు అధికారులను నిలదీశారు. కొన్ని వాహనాలు ముందు.. మరికొన్ని వాహనాలు వెనకగా యాత్ర సాగుతోంది.