రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణను ప్రశ్నిస్తున్న ఏపీ సీఐడీ
ABN , First Publish Date - 2021-12-10T21:11:52+05:30 IST
రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ లక్ష్మీనారాయణను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తున్నారు. 2017 జీవో ఎంఎస్-4 గురించి తనకు తెలియదని లక్ష్మీనారాయణ చెబుతున్నారు.
హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ లక్ష్మీనారాయణను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తున్నారు. 2017 జీవో ఎంఎస్-4 గురించి తనకు తెలియదని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. తాను డైరెక్టర్గా ఉన్నప్పుడు 8 మంది ఎండీలు మారారని, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న సమయంలో రిటైర్డ్ అయ్యానని తెలిపారు. సిమెన్స్తో ఎలాంటి ఒప్పందం కుదిరిందని ఏపీ సీఐడీ ప్రశ్నించారు. సిమెన్స్ వివిధ ప్రాంతాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, సిమెన్స్ మేనేజ్మెంట్తో తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సిమెన్స్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంవోయూ ఉందని, కార్పొరేషన్ రోజువారీ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదని లక్ష్మీనారాయణ తెలిపారు.