Hyd: మురికికూపంగా ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్
ABN , First Publish Date - 2021-09-08T19:36:04+05:30 IST
భారీ వర్షాలకు హైదరాబాద్లోని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం లేక్ వ్యూ గెస్ హౌస్ మురికికూపంగా మారింది.
హైదరాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్లోని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం లేక్ వ్యూ గెస్ హౌస్ మురికికూపంగా మారింది. బురద, డ్రైనేజ్ నీటితో కంపుకొడుతోంది. నిన్నటివరకు నడుమలోతు నీళ్లు నిలిచాయి. ఇంత జరుగుతున్నా.. అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. రాజ్భవన్ రోడ్డులో ప్రతిరోజూ విఐపీలు, వివిఐపీలు, అధికారులు తిరుగుతుంటారు.. అంతా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడంతో ఏపీ సీఎం నుంచి, ముఖ్య అధికారుల వరకు ఎవరు హైదరాబాద్ వచ్చినా లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో బస చేస్తారు. హైదరాబాద్లోనే ఉంది గాబట్టి ఆర్ అండ్ బీ డిపార్టుమెంట్ చూడాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రభుత్వమే లేక్ వ్యూ గెస్ హౌస్ బాగోగులు చూసుకోవాలని ఏపీ అధికారులు అంటున్నారు.