కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు.. జగన్ రెడ్డీ గుర్తుపెట్టుకో: లోకేశ్

ABN , First Publish Date - 2021-04-14T17:01:39+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. వైఎస్ వివేకానంద హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రమాణం చేయడానికి అలిపిరి సర్కిల్‌కు చేరుకున్న ఆయన..

కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు.. జగన్ రెడ్డీ గుర్తుపెట్టుకో: లోకేశ్

తిరుపతి: సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. వైఎస్ వివేకానంద హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రమాణం చేయడానికి అలిపిరి సర్కిల్‌కు చేరుకున్న ఆయన.. వివేకా హత్యపై వైసీపీ నేతలు పూటకో మాట చెప్పారన్నారు. నారాసుర రక్తచరిత్ర అంటూ దొంగవార్తలు రాశారని మండిపడ్డారు. ఆయనేమన్నారంటే... ‘‘నాకు, నా కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి పాత్ర లేదని ఆ వేంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేస్తామని ఏప్రిల్ 7న సూళ్లూరుపేటలో సవాల్ చేశాను. జగన్ పెద్ద దొంగ... ఏ2 విజయ్ సాయిరెడ్డి చిన్న దొంగ. వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీ నేతల్లో చాలా మంది ఇదే మాట అన్నారు. దాదాపు మూడు గంటల తర్వాత పోలీసుల విచారణలో ఆయనను గడ్డపారతో చంపారని తేలింది. పోస్టుమార్టం జరగకముందే ఎవిడెన్స్ లేకుండా ఆరోజే చెరిపేశారు. ఆ సమయంలో గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులందరూ సీన్‌లో ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత మాట మార్చారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు హస్తం ఉందని ఆరోపించారు. తాతను, వివేకాను చంపింది మేమేనన్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసి కూడా ఇదే చెప్పారు. మరి సీఎం అయ్యాక ఎందుకు... సీబీఐ విచారణ జరపడం లేదు. చిత్తశుద్ధి ఉంటే అలిపిరికి రావొచ్చు కదా.  ఎందుకు రాలేదు? నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద పెద్ద వార్తలు రాశారు. మా కుటుంబానికి రక్తచరిత్ర లేదు. ‘కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు.. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-04-14T17:01:39+05:30 IST