ఏపీలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు.. మృతులు 8 వేలుపైనే..!

ABN , First Publish Date - 2021-05-07T00:56:02+05:30 IST

ఏపీలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు.. మృతులు 8 వేలుపైనే..!

ఏపీలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు.. మృతులు 8 వేలుపైనే..!

అమరావతి: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జనం పిట్లల్లా రాలిపోతున్నారు. కొత్తగా 21,954 కరోనా కేసులు నమోదు కాగా 72 మంది మృతి చెందారు.  ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 12 లక్షల 28 వేల 186కి చేరగా 8,446 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 1 లక్షా 82 వేల 329 యాక్టివ్‌ కేసులు ఉండగా ఇప్పటివరకూ 10 లక్షల 37 వేల 411 మంది రికవరీ అయ్యారు. తాజాగా  విశాఖ జిల్లాలో కరోనాతో 11 మంది మృతి చెందారు. తూ.గో, విజయనగరం జిల్లాల్లో 9 మంది, అనంతపురం జిల్లాలో 8, ప్రకాశం జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. ఇక చిత్తూరు, ప.గో, గుంటూరు జిల్లాల్లో ఐదుగురు, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, నెల్లూరు జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతి చెందారని ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


Updated Date - 2021-05-07T00:56:02+05:30 IST