ఏపీ అప్డేట్.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-14T19:41:27+05:30 IST
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కరోనా కారణంగా 43 మంది మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కొత్తగా 1916 కరోనా కేసులు నమోదైనట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కరోనా కారణంగా 43 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 33,019 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 15,144 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతుంటే, 17,467 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 408 మంది చనిపోయారు.