ఏపీలో కొత్తగా 4,549 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-06-15T00:04:36+05:30 IST

ఏపీలో కొత్తగా 4,549 కరోనా కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 4,549 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో కొత్తగా 4,549 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 59 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,14,393కి కరోనా కేసులు చేరగా, కరోనాతో  11,999 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 80,013 యాక్టివ్‌ కేసులు ఉండగా, 17,22,381 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 10,114 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో 24 గంటల్లో 87,756 కరోనా టెస్టుల నిర్వహించారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 12, ప్రకాశం జిల్లాలో 8 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, గుంటూరు, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలుకోల్పోయారు.

Updated Date - 2021-06-15T00:04:36+05:30 IST