కరోనాకు మెడిసిన్ లేదు..: ఏపీ డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2020-03-26T19:20:59+05:30 IST

రోనాకు మెడిసిన్ లేదని.. నివారణే ఏకైక మార్గమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.

కరోనాకు మెడిసిన్ లేదు..: ఏపీ డిప్యూటీ సీఎం

చిత్తూరు : కరోనాకు మెడిసిన్ లేదని.. నివారణే ఏకైక మార్గమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. ఇవాళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి మీడియా మీట్ నిర్వహించిన డిప్యూటీ సీఎం.. కరోనాను ప్రజలందరూ ధైర్యంగా ఎదుర్కొందామన్నారు. పోలీస్ వ్యవస్ధ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు.


 ‘ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలి. ఖచ్చితంగా బయటకు రాకూడదు.. ముఖ్యమంత్రి ఆదేశాలను అందరూ పాటించాలి. వాలంటీర్లకు కృతజ్ఞతలు.. వారు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు’ అని నారాయణ స్వామి వెల్లడించారు. 

Updated Date - 2020-03-26T19:20:59+05:30 IST