AP డ్రగ్స్ వ్యవహారం.. ఓ ఎమ్మెల్యే కొడుకే డీలర్: టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-10-06T17:43:51+05:30 IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో డ్రగ్స్ కేసు సంచలంగా మారింది.

AP డ్రగ్స్ వ్యవహారం.. ఓ ఎమ్మెల్యే కొడుకే డీలర్: టీడీపీ నేతలు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కొడుకు పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసు వ్యవహారంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికారపార్టీ నేతలే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ పరిణామాల మధ్యే గుంటూరులో డ్రగ్స్ దందా తెరపైకి వచ్చింది. జిల్లాలో అతిపెద్ద డ్రగ్ డీలర్ ఓ ఎమ్మెల్యే కొడుకేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


గతంలో గుంటూరు జిల్లా నల్లపాడులోని ఓ అపార్టుమెంట్‌లో డ్రగ్స్ తయారు చేయించిన ఘటన మరోసారి చర్చకు దారి తీసింది. ఆ డ్రగ్స్ తయారు చేసే విదేశీయులు గుంటూరు నగరానికి చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్లు బైక్‌లపై వేసుకుని తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ  ఎమ్మెల్యే కొడుకే ఈ డ్రగ్స్ తయారీలో సూత్రధారి అని ప్రచారం జోరుగా సాగింది. అధికార బలంతో ఎమ్మెల్యే కొడుకును తప్పించి, విదేశీయుల అరెస్టు చూపించి.. విచారణను మమా అనిపించారన్న విమర్శలు పోలీసులపై వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2021-10-06T17:43:51+05:30 IST