ఈఏపీసెట్ ఫార్మా, అగ్రికల్చర్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2021-09-14T17:26:28+05:30 IST
అమరావతి: ఏపీ ఈఏపీసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫలితాలు విడుదలయ్యాయి.
అమరావతి: ఏపీ ఈఏపీసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 72,488 (92 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాలు వెబ్ సైట్లో పెట్టామన్నారు. మార్కులు, ర్యాంకులు బుధవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. ఈఏపీసెట్ ఆన్ లైన్లో నిర్వహించడమనేది ఒక సవాల్ అని, కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్ష నిర్వహించామని మంత్రి తెలిపారు.
టాప్ టెన్ ర్యాంకులు ప్రకటించిన మంత్రి
మొదటి ర్యాంక్ చందన్ విష్ణు వివేక్ (తూర్పు గోదావరి), సెకండ్ ర్యాంక్: ఆర్. శ్రీనివాస కార్తికేయ (అనంతపురం), థర్డ్ ర్యాంక్: బొల్లినేని విశ్వాసరావు (హన్మకొండ), 4వ ర్యాంక్: సమియేనరెడ్డి (రంగారెడ్డి), 5వ ర్యాంక్: కాసాల హరి (అమ్మాయి, హైదరాబాద్), 6వ ర్యాంక్: చైతన్య కృష్ణ (గుంటూరు), 7వ ర్యాంక్: నూతలపాటి దివ్య (గుంటూరు), 8వ ర్యాంక్: కల్యాణం రాహుల్ సిద్ధార్ద్ (సిద్ధిపేట), 9వ ర్యాంక్: సాయిరెడ్డి (నల్గొండ), 10వ ర్యాంక్: గద్దె విదీప్ (గుంటూరు). దీనికి సంబంధించిన సీడీని మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.