ఉమ్మడి పోరాటం.. శుక్రవారం కార్యాచరణ: ఉద్యోగ సంఘాలు
ABN , First Publish Date - 2022-01-21T00:51:27+05:30 IST
పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఓ ప్రైవేటు హోటల్లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. ..
విజయవాడ: పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఓ ప్రైవేటు హోటల్లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. శుక్రవారం మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పీఆర్సీపై జారీ చేసిన జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులందరికి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.
కాగా పీఆర్సీలో ఫిట్మెంట్ తగ్గించడం, హెచ్ఆర్ఏలో కోత విధించడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల నిరసనలతో ఏపీ అట్టుడికిపోతోంది. పీఆర్సికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. జీఓలను రద్దు చేస్తేనే తాము ప్రభుత్వంతో చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.