అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల భారీ ర్యాలీలు, ధర్నాలు

ABN , First Publish Date - 2022-01-25T20:04:07+05:30 IST

ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి.

అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల భారీ ర్యాలీలు, ధర్నాలు

అమరావతి: ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.


ప్రధానంగా ఏపీ ఉద్యోగులు ఐదు డిమాండ్లపై సమ్మెకు దిగనున్నారు. పీఆర్సీకి సంబంధించి మిశ్రా కమిటీ నివేదికను బహిర్గం చేయాలని, ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏ, పాత స్లాబులు.. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి పాత హెచ్ఆర్ఏ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఏ, అదనపు పెన్షన్, గ్రాడ్యూటీ అమలు తేదీ, మొనిటరీ ప్రయోజనాల నుంచి రికవరీ నిలుపుదల చేయాలని, కేంద్ర పీఆర్సీ అమలు యోచన నిలిపివేయాలని  ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-25T20:04:07+05:30 IST