ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ సేవలపై తప్పుడు ప్రచారం

ABN , First Publish Date - 2021-09-18T22:51:17+05:30 IST

ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ సేవలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫైబర్

ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ సేవలపై తప్పుడు ప్రచారం

విశాఖ: ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ సేవలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి అన్నారు. అప్పులు తీర్చడానికే  ఏపీ ఫైబర్‌నెట్ లాభాలు సరిపోతుందన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నష్టం జరిగిందని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఐడీ విచారణ తర్వాత బాధ్యులందరూ బయటకు వస్తారన్నారు. ఏపీ ఫైబర్‌నెట్‌లో లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని గౌతమ్‌రెడ్డి తెలిపారు. సామర్థ్యం పెంచడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-09-18T22:51:17+05:30 IST