సీఎం జగన్‌కు ఏపీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ జేఏసీ లేఖ

ABN , First Publish Date - 2021-05-04T22:43:25+05:30 IST

ఏపీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ జెఏసీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. కొవిడ్‌ పోరాటంలో చాలా మంది ఉద్యోగులు ప్రాణాలు కొల్పోయారని లేఖలో తెలిపారు.

సీఎం జగన్‌కు ఏపీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ జేఏసీ లేఖ

అమ‌రావ‌తి: ఏపీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ జేఏసీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. కొవిడ్‌ పోరాటంలో చాలా మంది ఉద్యోగులు ప్రాణాలు కొల్పోయారని లేఖలో తెలిపారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో బెడ్లు, మెడిక‌ల్ వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొవిడ్ సోకిన ఉద్యోగుల‌కు ప్రత్యేక సీఎల్‌లు ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల‌కు వ‌ర్క్‌ ఫ్రం హోం అవ‌కాశం క‌ల్పించాలని లేఖలో వివరించారు. కొవిడ్‌తో మ‌ర‌ణించిన ఉద్యోగుల‌కు తక్షణం ఎక్స్‌గ్రేషియా అందించాలని ఏపీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ జేఏసీ లేఖలో సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-04T22:43:25+05:30 IST