అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-09-29T19:10:25+05:30 IST
అమరావతి: అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. జూన్లో బడ్జెట్ సమావేశాల అనంతరం మళ్లీ సమావేశాలు జరగలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అక్టోబర్ 10 తర్వత నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. గురువారం జరిగే కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.