మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-11-26T23:54:45+05:30 IST

రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది

మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

అమరావతి: రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాజమండ్రి జైలు నుండి 19 మంది, కడప నుండి 27 మంది, నెల్లూరు జైలు నుండి ఐదుగురు, విశాఖ నుంచి ఇద్దరు విడుదలకు రంగం సిద్ధం చేసింది. రూ. 50 వేల పూచీకత్తు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా 3 నెలలకోసారి పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని ప్రభుత్వం సూచించింది.

Updated Date - 2020-11-26T23:54:45+05:30 IST