ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2021-09-03T22:25:06+05:30 IST

జగనన్నవిద్యా దీవెన పథకం చెల్లింపులలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యా దీవెన కార్యక్రమం

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ

అమరావతి: జగనన్నవిద్యా దీవెన పథకం చెల్లింపులలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యా దీవెన కార్యక్రమం కింద తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. అయితే తల్లులు ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం  స్పష్టం చేసింది. అయితే ఫీజులను కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లో జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్టును ఆశ్రయించారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో ఈ రోజు విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యా దీవెన డబ్బులు విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ అకౌంట్లలో జమ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది. నేరుగా కాలేజీల అకౌంట్లలో డబ్బులు జమ అవ్వాలని సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-09-03T22:25:06+05:30 IST