ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు
ABN , First Publish Date - 2021-10-13T17:13:59+05:30 IST
ఏపీ ఉద్యోగ సంఘాలతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది.
అమరావతి: ఏపీ ఉద్యోగ సంఘాలతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని సీఎం కార్యాలయం నుంచి ఏపీఎన్జీవో నేతలకు పిలుపు వచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు, ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ నివాసంలోని సీఎంవో కార్యాలయానికి చేరుకున్నారు. పీఆర్సీ, పెండింగ్ డిఏ, రిటైర్మంట్ బెనిఫిట్స్, ఒకటోతారీఖునే జీతం వంటి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు విజ్జప్తి చేయనున్నాయి.
వరుస ప్రకటనల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను సీఎంవో క్యాంపు కార్యాలయంకు రావాలని పిలుపు వచ్చింది. కేవలం ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ, అమారావతి సంఘాలకు మాత్రమే పిలుపు వచ్చింది. ఇతర ఉద్యోగ సంఘాలను పిలవక పోవడంపై ఆయా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.