హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-06-05T02:49:40+05:30 IST

ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వ జీవోలు 81, 85లను..

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వ జీవోలు 81, 85లను హైకోర్టు రద్దు చేసింది. పేద విద్యార్థుల కోసమే ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేస్తున్నామని హైకోర్టుకు తెలిపింది. మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలంటూ విడుదల చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియాన్ని కోరుకుంటున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

Updated Date - 2020-06-05T02:49:40+05:30 IST