ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన అనిత
ABN , First Publish Date - 2020-05-27T23:39:36+05:30 IST
ఏపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత వంగలపూడి అనిత సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక డాక్టర్ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే డాక్టర్ సుధాకర్ను
విశాఖ: ఏపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత వంగలపూడి అనిత సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక డాక్టర్ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే డాక్టర్ సుధాకర్ను బయటికి పంపిస్తామని, మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారని తెలిపారు. అందరూ కలిసి సుధాకర్ని నిజంగా పిచ్చోడిని చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సుధాకర్కి అన్యాయం జరిగితే దళిత జాతికి అన్యాయం జరిగినట్లేనని చెప్పారు. మనకెందుకులే అనుకుంటే రేపు మనకు ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రేపటిలోగా ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఆందోళనలు ఉధృత చేస్తామని అనిత ప్రకటించారు.