స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్లకు చైర్మన్లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-10-07T19:57:33+05:30 IST

స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్లకు చైర్మన్లను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గ‌న్నమ‌ని వెంక‌టేశ్వర‌రావు గ్రేట్ విశాఖప‌ట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌‌గా నియమించారు.

స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్లకు చైర్మన్లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్లకు చైర్మన్లను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గ‌న్నమ‌ని వెంక‌టేశ్వర‌రావు గ్రేట్ విశాఖప‌ట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌‌గా నియమించారు. అల్లి రాజాబాబు యాద‌వ్‌ను కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్‌ చైర్మన్, నారమ‌ల్లి ప‌ద్మజను తిరుప‌తి స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ చైర్మన్‌, బొడ్డాని అఖిల ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్లకు చైర్మన్లు పదవిలో కొనసాగనున్నారు.

Updated Date - 2021-10-07T19:57:33+05:30 IST