జన్మదిన వేడుకలకు దూరంగా గవర్నర్
ABN , First Publish Date - 2021-08-02T07:57:38+05:30 IST
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తన జన్మదినాన్ని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా గతేడాది గవర్నర్
కరోనా నేపథ్యంలో రెండో ఏడాది రద్దు
శుభాకాంక్షలు తెలిపేందుకు రావద్దంటూ రాజ్భవన్ విజ్ఞప్తి
అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తన జన్మదినాన్ని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా గతేడాది గవర్నర్ జన్మదినాన్ని జరుపుకోలేదు. ఈ ఏడాది కూడా కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవ్వరూ రాజ్భవన్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రమాదాన్ని తగ్గించడంలో, వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో టీకా సహాయపడుతుందన్నారు. అర్హులైన వారందరూ టీకాలు వేయించుకోవాలని ఆయ న కోరారు.