డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ABN , First Publish Date - 2021-06-11T23:21:28+05:30 IST

2008 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అందించింది. అప్పట్లో పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో 2,193 మందికి..

డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

అమరావతి: 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అందించింది. అప్పట్లో పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో 2,193 మందికి పోస్టింగులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం వెల్లడించాడు. వీరి సదరు అభ్యర్థుల కోసం ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. 


‘మొత్తం 2,193 మంది అర్హులకు ఎస్‌జీటీ పోస్టింగులివ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. మినిమమ్ టైమ్ స్కేల్‌ విధానంలో పని చేసేందుకు అభ్యర్థులు రాత పూర్వకంగా అంగీకారం తెలిపాం. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేవలం డీఎస్సీ-2008 అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించాం. దీనికి సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేస్తాం’ అంటూ  మంత్రి ఆదిమూలపు వెల్లడించాడు.



Updated Date - 2021-06-11T23:21:28+05:30 IST