సింధుకు 30 లక్షల నజరానా

ABN , First Publish Date - 2021-08-04T09:23:35+05:30 IST

టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 30 లక్షల నగదు అందించనున్నట్టు తెలుస్తోంది...

సింధుకు 30 లక్షల నజరానా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 30 లక్షల నగదు అందించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి క్రీడా పాలసీ ప్రకారం సింధుకు నగదు ప్రోత్సాహకం అందించాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ క్రీడాశాఖ అధికారులను మంగళవారం ఆదేశించారు. సింధుతో పాటు ఇటీవల కాలంలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులందరికీ నజరానాలు వెంటనే ఇవ్వాల్సిందిగా అధికారులకు జగన్‌ సూచించారు.


Updated Date - 2021-08-04T09:23:35+05:30 IST