‘తెలంగాణ రాష్ట్ర చిహ్నం’తో ఏపీ ప్రభుత్వ ప్రకటన

ABN , First Publish Date - 2021-01-27T21:18:22+05:30 IST

తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన ‘కాకతీయ కళాతోరణం’ ఆ ఫొటోలో స్పష్టంగా కనపడుతుంటంతో

‘తెలంగాణ రాష్ట్ర చిహ్నం’తో ఏపీ ప్రభుత్వ ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: ‘పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుందాం.. గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం’ అంటూ ఏపీ సర్కార్ ఇచ్చిన ప్రకటన విమర్శల పాలవుతోంది. ప్రకటనలో గ్రామ పంచాయతి కార్యాలయం ఫొటోను పెట్టిన ప్రభుత్వం.. పొరపాటుగా తెలంగాణ పంచాయతీ కార్యాలయం ఫొటోను పెట్టారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన ‘కాకతీయ కళాతోరణం’ ఆ ఫొటోలో స్పష్టంగా కనపడుతుంటంతో జగన్ సర్కార్‌ను నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కనీస అవగాహన లేకుండా ప్రకటన ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.  



Updated Date - 2021-01-27T21:18:22+05:30 IST