త్వరలో ఏపీలో 26 జిల్లాలు: విప్ పిన్నెల్లి
ABN , First Publish Date - 2022-01-25T22:01:46+05:30 IST
ఏపీలో త్వరలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయని
గుంటూరు: ఏపీలో త్వరలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయనున్నామని ఆయన తెలిపారు. రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. నరసరావుపేట పార్లమెంట్ కేంద్రాన్ని పిడుగురాళ్ల, గురజాలలో పెట్టాలని సీఎంను కోరామని పిన్నెల్లి తెలిపారు.