రానున్న నాలుగైదు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-09-26T13:51:21+05:30 IST

రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశ ఉందని విపత్తుల నిర్వహణ శాఖ నిర్వాహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.

రానున్న నాలుగైదు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

అమరావతి: రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశ ఉందని విపత్తుల నిర్వహణ శాఖ నిర్వాహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు  నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పు గోదావరి జిల్లాలలో ఒంటరి ప్రదేశాలలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు  పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  కె. కన్నబాబు హెచ్చరించారు.

Updated Date - 2020-09-26T13:51:21+05:30 IST