రాజధాని రైతులకు కౌలు చెల్లించలేదంటూ హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2021-09-30T17:01:08+05:30 IST

రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో కొంతమందికి కౌలు చెల్లించలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

రాజధాని రైతులకు కౌలు చెల్లించలేదంటూ హైకోర్టులో పిటిషన్

అమరావతి: రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో కొంతమందికి కౌలు చెల్లించలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాది వి వి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కొంతమందికి కౌలు ఇచ్చి మిగతా వారికి ఇవ్వలేదని  న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా కౌలు విడుదల చేయాలంటూ ఇప్పటికే జీఓ ఇచ్చామని  ఏఎంఆర్‌డీఏ న్యాయవాది పేర్కొన్నారు. పూర్తి వివరాలు వచ్చే గురువారంలోపు ఇవ్వాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. 

Updated Date - 2021-09-30T17:01:08+05:30 IST