శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు జస్టిస్
ABN , First Publish Date - 2021-10-25T05:14:29+05:30 IST
ఆంధ్రప్రదేశ్ హైకో ర్టు జస్టిస్ ఎం.వెంకటరమణ ఆదివారం తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు.
కడప మారుతీనగర్, అక్టోబరు 24: ఆంధ్రప్రదేశ్ హైకో ర్టు జస్టిస్ ఎం.వెంకటరమణ ఆదివారం తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు. కడప పర్యటనలో భాగంగా ఆయన సతీసమేతంగా ఆలయాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ స్వామి వారి దర్శన ం మనస్సును తేలికపరిచినట్లయిందన్నారు. కార్యక్రమంలో దేవునికడప ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.