శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు జస్టిస్‌

ABN , First Publish Date - 2021-10-25T05:14:29+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ హైకో ర్టు జస్టిస్‌ ఎం.వెంకటరమణ ఆదివారం తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు.

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు జస్టిస్‌
దేవుని కడప వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న హైకోర్టు జస్టిస్‌ వెంకటరమణ దంపతులు

కడప మారుతీనగర్‌, అక్టోబరు 24: ఆంధ్రప్రదేశ్‌ హైకో ర్టు జస్టిస్‌ ఎం.వెంకటరమణ  ఆదివారం తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు. కడప పర్యటనలో భాగంగా ఆయన  సతీసమేతంగా ఆలయాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ స్వామి వారి దర్శన ం మనస్సును తేలికపరిచినట్లయిందన్నారు. కార్యక్రమంలో దేవునికడప ఆలయ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-25T05:14:29+05:30 IST