జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను కొట్టేసిన ఏపీ హైకోర్టు

ABN , First Publish Date - 2021-05-05T17:41:44+05:30 IST

కడప జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను కొట్టేసిన ఏపీ హైకోర్టు

అమరావతి: కడప జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 24న జువారీ సిమెంట్ మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జువారీ సిమెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పొల్యూషన్ బోర్డు సూచనలను ఈ నెల 31లోపు అమలు చేయాలని జువారీ సిమెంట్స్‌కి ఆదేశాలు జారీ చేస్తూ... అప్పటి వరకు కంపెనీ నడుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2021-05-05T17:41:44+05:30 IST