టీఆర్ఎస్ నేత మల్లాది వాసుకు ఏపీ హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2021-12-20T21:35:24+05:30 IST
టీఆర్ఎస్ నేత మల్లాది వాసుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ నేతలపై మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
ఖమ్మం: టీఆర్ఎస్ నేత మల్లాది వాసుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ నేతలపై మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. దాంతో మల్లాది వాసు హైకోర్టును ఆశ్రయించారు. మల్లాది వాసును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వాసుపై పెట్టిన అన్నీ కేసుల్లోనూ 41ఏ నిభందనను అనుసరించండి అని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.