జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2021-09-17T17:28:22+05:30 IST

అమరావతి: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

అమరావతి: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విశాఖపట్నంలో నగర పాలక సంస్థ అధికారులు తొలగించిన ఫ్యూజన్ ఫుడ్‌పై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఫుడ్స్ తొలగింపు అక్రమమని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై  రాష్ట్ర ప్రభుత్వం డివిజినల్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం వాదోపవాదనలు విన్న అనంతరం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం వేసిన అప్పీలును కొట్టివేసింది. వారం రోజుల్లో ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యానికి పొజిషన్ అప్పగించాలని ఆదేశించింది.

Updated Date - 2021-09-17T17:28:22+05:30 IST