టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-01-04T23:35:30+05:30 IST

టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. నేర చరిత్ర గల 18 మందిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ

అమరావతి: టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. నేర చరిత్ర గల 18 మందిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివరణ ఇవ్వాలని 18 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చినా ఎవరూ కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ముగ్గురు సభ్యులు నోటీసులు కూడా తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నోటీసులు తీసుకోని బోర్డు సభ్యులు అల్లూరి మహేశ్వరి, ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి ఎంఎన్‌ శశిధర్‌లపై పిల్ ఫైల్‌ అయినట్టు ప్రకటన ఇవ్వాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 7కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2022-01-04T23:35:30+05:30 IST