మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2021-04-22T22:44:51+05:30 IST
మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్
అమరావతి: మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.19ని రద్దు చేయాలని ఉండవల్లి రైతు సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున రిట్ పిటిషన్ను హైకోర్టు న్యాయవాది రవిశంకర్ దాఖలు చేశారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ..ఇచ్చిన జీవో అక్రమం, నిబంధనలకు విరుద్ధమని పిటిషన్లో వెల్లడించారు. ఆర్టికల్ 14, 19, 21, 243Q, 300A ప్రకారం ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. సెలవుల తర్వాత విచారణ చేపడతామని జస్టిస్ మానవేంద్రరాయ్ తెలిపారు. విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.