ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల..
ABN , First Publish Date - 2020-09-26T11:52:39+05:30 IST
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 78.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 51,991 మంది విద్యార్థులు హాజరైనారు. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు
అమరావతి: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 78.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 51,991 మంది విద్యార్థులు హాజరైనారు. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు విడుదల చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా కారణంగా పరీక్షలు రాయని విద్యార్థులకు అక్టోబర్ 7న మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఈ ఏడాది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామని, ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, టెన్త్ సిలబస్ ఆధారంగా ట్రిపుల్ ఐటీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. నవంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించాలని యోచనలో ఉన్నట్లు సురేష్ పేర్కొన్నారు.