‘రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది’
ABN , First Publish Date - 2021-08-10T21:12:57+05:30 IST
ప్రస్తుతం రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు.
విశాఖపట్నం: ప్రస్తుతం రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. మంగళవారం అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. డీజిల్ ధరలు బారీగా పెరుగుతుండడంతో లారీలను నడపలేని పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోన సమయంలో అందర్నీ ఆదుకున్నట్లే.. ప్రభుత్వం తమను కూడా అదుకోవాలని డిమాండ్ చేశారు.