ఏపీ మంత్రి శంకర్ నారాయణపై జనసేన ఫైర్

ABN , First Publish Date - 2020-08-03T21:17:11+05:30 IST

ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు, ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.

ఏపీ మంత్రి శంకర్ నారాయణపై జనసేన ఫైర్

అనంతపురం: ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు, ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పెనుకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన నేతలు.. పవన్‌ను విమర్శించే ముందు మంత్రి తన తమ్ముళ్లు చేస్తున్న దందాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వాటిని అరికట్టకుండా పవన్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. పెనుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీరా, మీ తమ్ముళ్లా అని ఘాటుగా ప్రశ్నించారు.108 అంబులెన్సులను ప్రారంభించడాన్ని తమ నాయకుడు పవన్ అభినందినప్పుడు మీరేమైనా ప్యాకేజీ ఇచ్చారా అన్నారు. పవన్ కల్యాణ్‌పై మాట్లాడటం మానుకొని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.  లేకుంటే ఇదే చివరి అవకాశం అవుతుందని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-08-03T21:17:11+05:30 IST