‘నవరత్నాల పేరుతో ప్రజలకు నవనామాలు’

ABN , First Publish Date - 2021-08-02T02:44:13+05:30 IST

‘నవరత్నాల పేరుతో ప్రజలకు నవనామాలు’

‘నవరత్నాల పేరుతో ప్రజలకు నవనామాలు’

అమరావతి: నవరత్నాల పేరుతో ప్రజలకు నవనామాలు పెట్టారని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం ముసలివాళ్లను కూడా మోసం చేసిన ఘనత జగన్ రెడ్డిదన్నారు. జూలై 8న వైయస్ జయంతికి పించన్ రూ, 2,250 నుంచి రూ. 2,500 కు పెంచుతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ ఆగస్టు నెల కూడా రూ. 2,250 ఇచ్చి మళ్లీ మాట తప్పారని చెప్పారు. ఓట్ల కోసం జగన్ మమ్మిల్ని మోసం చేశారని వృద్దులు, వితంతవులు, వికలాంగులు వాపోతున్నారని అన్నారు. వారిని మోసం చేయటానికి జగన్ రెడ్డికి మనసెలా వచ్చింది? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళలకు 45 ఏళ్లకే ఫించన్ ఇస్తామని అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఫించన్ దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ వరకు అన్నింటా జగన్ మాట తప్పారని చెప్పారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం ఆగస్టు నెల నుంచే ఫించన్ రూ, 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-02T02:44:13+05:30 IST