కరోనాకు గేట్లు ఎత్తేశారు: యనమల

ABN , First Publish Date - 2020-08-13T07:15:10+05:30 IST

కరోనాకు గేట్లు ఎత్తేశారు: యనమల

కరోనాకు గేట్లు ఎత్తేశారు: యనమల

అమరావతి/నెల్లూరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనాకు రాష్ట్ర సర్కారు గేట్లు ఎత్తేసింది. కొవిడ్‌-19 నియంత్రణలో జగన్‌ చేతులెత్తేశారు. నాలుగు నెలల క్రితం కేసుల్లో అట్టడుగున ఉన్న రాష్ట్రం ఇప్పుడు టాప్‌ ర్యాంకులోకి చేరింది. దూరదృష్టి లోపం, సమీక్షల్లో వైఫల్యం, దిశానిర్దేశం కొరవడడం, తేలిగ్గా తీసుకోవడం, నిర్లక్ష్యం చేయడం వైసీపీ ప్రభుత్వ పంచ మహాపాతకాలు. అమెరికా, బ్రెజిల్‌ స్థాయికి మన రాష్ట్రం చేరడం సిగ్గుచేటు’’ అని టీడీపీ  నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ‘‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం మీ పబ్జీ గేమ్‌ కాదని గుర్తుంచుకోండి. రోజుకు 90మంది ప్రాణాలు కోల్పోతుంటే నిద్ర ఎలా పడుతోంది’’ అని సీఎంను ప్రశ్నించారు. కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. యువకుడైన సీఎం రాష్ట్రంలో ఉండి కూడా, నాలుగు ఆసుపత్రులు తిరిగి ప్రజలకు ధైర్యం కల్పించలేకపోవడం దురదృష్టకరమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. 

Updated Date - 2020-08-13T07:15:10+05:30 IST