కరోనా పరీక్షలు చేస్తారని ‘పాజిటివ్‌’ యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-13T07:14:39+05:30 IST

కరోనా పరీక్షలు చేస్తారని ‘పాజిటివ్‌’ యువకుడి ఆత్మహత్య

కరోనా పరీక్షలు చేస్తారని ‘పాజిటివ్‌’ యువకుడి ఆత్మహత్య

ఏలూరు క్రైం, ఆగస్టు 12: కరోనా పరీక్ష చేస్తారనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిల్‌హౌ్‌సపేటకు చెందిన ఐశ్వర్‌ రాజ్‌(25)కు, వారి కుటుంబ సభ్యులకు ఈ నెల 3న కరోనా పరీక్షలు నిర్వహించారు. ఐశ్వర్‌రాజ్‌తో పాటు కొంతమందికి పాజిటివ్‌ వచ్చింది. అయితే వారికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అప్పటినుంచి వారు ఇంట్లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. అయితే గురువారం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారనే భయంతో రాజ్‌ బుధవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Updated Date - 2020-08-13T07:14:39+05:30 IST