పారదర్శకంగా సచివాలయ పరీక్షలు: మంత్రులు

ABN , First Publish Date - 2020-08-13T07:28:40+05:30 IST

పారదర్శకంగా సచివాలయ పరీక్షలు: మంత్రులు

పారదర్శకంగా సచివాలయ పరీక్షలు:  మంత్రులు

వచ్చే నెల 20 నుంచి నిర్వహించనున్న సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారం రోజులు నిర్వహించే ఈ పరీక్షలకు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రులు ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T07:28:40+05:30 IST